ఖమ్మం జిల్లా

ఆంధ్రపదేశ్ లో ఖమ్మం జిల్లా ఈశాన్య ప్రాంతంగా ఉంటుంది. ఖమ్మం తూర్పు రేఖాంశం 79.47 కు 80.47 మద్య గాను ఉత్తర అక్షాంశం 16.45’ కు 18.35’ మద్యగాను ఉండి 15,921 చ. కిలోమీటర్ల విస్టీర్ణంలో వ్యాపించి ఉన్నది. జిల్లాకు ఉత్తరమున మద్య ప్రదేశ్, చత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాలు , తూర్పున తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, పడమర నల్లగోండ, వరంగల్ జిల్లాలు, దక్షిణాన కృష్ణా జిల్లాలు సరిహద్దులుగా వున్నాయి. ఖమ్మం జిల్లా 1953 లొ పరిపాలనా సౌలబ్యం కొసము ఏర్పరచబడినది, అప్పటి వరకు వరంగల్ జిల్లాలో భాగంగా ఉన్న ఖమ్మం, మధిర, ఇల్లందు, బూర్గంపాడు, పాల్వంచ రెవెన్యూ డివిజన్ లను విడదీసి ఖమ్మం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేశారు. 1959 లో అప్పటి వరకు తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న భద్ర్రాచలం, మణుగూరు, వెంకటాపురం రెవెన్యూ డివిజన్ లను విడదీసి ఖమ్మం జిల్లాలో కలిపారు. మొదట దీనిని ఖమ్మం మెట్టు (పేజీ లేదు)" href="http://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%96%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B0%82_%E0%B0%AE%E0%B1%86%E0%B0%9F%E0%B1%8D%E0%B0%9F%E0%B1%81&action=edit&redlink=1">ఖమ్మం మెట్టుగా పిలిచేవారు. ఖమ్మం అనే పేరు అదే పట్టణమందు కల నృసింహాద్రి అని పిలువబడే నారసింహాలయము నుండి వచ్చినట్టుగా, కాలక్రమేనా అది స్థంభ శిఖరిగాను ఆపై స్తంభాద్రి గా పిలువబడినట్టు చెప్పబడుతున్నది. ఉర్దు భాషలో కంబ అనగా రాతి స్తంభము కావున ఖమ్మం అను పేరు ఆ పట్టణము నందు కల రాతి శిఖరము నుండి వచ్చినట్టుగా మరొక వాదన. కౄరమయిన నైజాం నవాబు పాలనకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుల నాయకత్వంలో వీరోచితంగా జరిగిన సాయుధ రైతాంగ పోరాటానికి కాకలు దీరిన యోధులను, నాయకులను అందించిన ప్రాంతంగా ఖమ్మం చరిత్రలో నిలిచిపోయింది. సింగరేణి బొగ్గు గనులతో, పచ్చని అడవులతో, పారే జీవనది గోదావరితో మరియు అధిక సంఖ్యలో గిరిజనులను కలిగియున్న ఈ జిల్లా విప్లవ పోరాటాలకు, ఉద్యమాలకు, రాజకీయ చైతన్యానికి ప్రతీక.


మా ఊరు

పుట్టి పెరిగిన ఊరు కన్న తల్లితో సమానం అంటారు. ప్రపంచంలో ఏ మూల వున్నా మన అమ్మని ఎలా మరిచిపోలేమో, సొంత ఊరును కూడా అలానే మరిచిపోలేము. దూరం ఎక్కువయ్యే కొద్దీ అనుబంధం మరింత పెరిగినట్లు మన ఊరికి దూరంగా నివసిస్తున్న కొద్దీ మరింత గుర్తుకొస్తుంటుంది. మీ ఊరంటే మీకెందుకింత ఇష్టమో తోటి పాఠకులతో పంచుకోండి. మీ ఊళ్ళో చిన్నప్పుడు మీరు చేసిన చిలిపి పనులూ, అప్పటి నేస్తాలూ, ఆడుకున్న ఆటలూ, ఆటల్లో తగాదాలూ, పంతాలూ, పండుగ రోజులూ, హైస్కూల్లో అల్లరి సంఘటనలూ... ఏమైనా వ్రాయండి. ఒక్క పేజీ మించకుండా ఉంటే బావుంటుంది. అప్పటి ఫోటోలు కూడా పంపిస్తే మీ వ్యాసం మరింత అందంగా వుంటుంది. ఈ విశాల ప్రపంచంలో ఇంకెక్కడో ఉన్న మన ఊరి నేస్తాలు మనల్ని మళ్ళీ పలకరిస్తారేమో చూడండి! మన ఊరి జ్ఞాపకాలతో బాటు ప్రస్తుతం మీరేం చేస్తున్నారో, ఎక్కడున్నారో కూడా వ్రాయడం మరువకండి... ! !

తల్లి కడుపులోనుండి బయటపడ్డాక ఇల్లు, ఇంట్లోంచి బయటపడ్డాక ఊరు మనిషిని ఆహ్వానిస్తుంది. అలా నన్ను ఆహ్వానించిన ఊరు పెద్దగొపతి (ఖమ్మం జిల్లా). నోరు విప్పి పిలవలేని నేల, మారు పలకలేని గుడి, గుడి మంటపాలు, ఆకలికి అన్నం ఎలాగో మనిషి అభివృద్ధికి చదువు అలాంటిదని అప్పటి వయస్సుకీ అర్థం అయ్యేలా బోధపరచి చదువు చెప్పిన బడి, బడిలోని గురువులు, ఆకలిని మరిపింపచేసి ఆడించే గ్రంధలయం అవరణ, సాగర్ కాలువలో ఈతలు, పంటకొచ్చిన వరికోతలు, కుప్ప నూర్పిళ్ళూ, ధాన్యం బస్తాలమీద ఎక్కి ఇంటికి రావడం, పండుగలకి ముస్తాబయ్యే మా ఊరు. కొన్ని లక్షల క్షణాల జ్ఞాపకాలను నా మస్తిష్కంలో నిక్షిప్తం చేసిన ఊరంటే నా కిష్టం.

ఖమ్మం ,khammam

ఆంధ్రపదేశ్ లో ఖమ్మం జిల్లా ఈశాన్య ప్రాంతంగా ఉంటుంది. ఖమ్మం తూర్పు రేఖాంశం 79.47 కు 80.47 మద్య గాను ఉత్తర అక్షాంశం 16.45’ కు 18.35’ మద్యగాను ఉండి 15,921 చ. కిలోమీటర్ల విస్టీర్ణంలో వ్యాపించి ఉన్నది. జిల్లాకు ఉత్తరమున మద్య ప్రదేశ్, చత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాలు , తూర్పున తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, పడమర నల్లగోండ, వరంగల్ జిల్లాలు, దక్షిణాన కృష్ణా జిల్లాలు సరిహద్దులుగా వున్నాయి. ఖమ్మం జిల్లా 1953 లొ పరిపాలనా సౌలబ్యం కొసము ఏర్పరచబడినది, అప్పటి వరకు వరంగల్ జిల్లాలో భాగంగా ఉన్న ఖమ్మం, మధిర, ఇల్లందు, బూర్గంపాడు, పాల్వంచ రెవెన్యూ డివిజన్ లను విడదీసి ఖమ్మం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేశారు. 1959 లో అప్పటి వరకు తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న భద్ర్రాచలం, మణుగూరు, వెంకటాపురం రెవెన్యూ డివిజన్ లను విడదీసి ఖమ్మం జిల్లాలో కలిపారు.
మొదట దీనిని
ఖమ్మం మెట్టుగా పిలిచేవారు. ఖమ్మం అనే పేరు అదే పట్టణమందు కల నృసింహాద్రి అని పిలువబడే నారసింహాలయము నుండి వచ్చినట్టుగా, కాలక్రమేనా అది స్థంభ శిఖరిగాను ఆపై స్తంభాద్రి గా పిలువబడినట్టు చెప్పబడుతున్నది. ఉర్దు భాషలో కంబ అనగా రాతి స్తంభము కావున ఖమ్మం అను పేరు ఆ పట్టణము నందు కల రాతి శిఖరము నుండి వచ్చినట్టుగా మరొక వాదన.
కౄరమయిన నైజాం నవాబు పాలనకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుల నాయకత్వంలో వీరోచితంగా జరిగిన సాయుధ రైతాంగ పోరాటానికి కాకలు దీరిన యోధులను, నాయకులను అందించిన ప్రాంతంగా ఖమ్మం చరిత్రలో నిలిచిపోయింది. సింగరేణి బొగ్గు గనులతో, పచ్చని అడవులతో, పారే జీవనది గోదావరితో మరియు అధిక సంఖ్యలో గిరిజనులను కలిగియున్న ఈ జిల్లా విప్లవ పోరాటాలకు, ఉద్యమాలకు, రాజకీయ చైతన్యానికి ప్రతీక.